తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ నియామకాల ఇంటర్వ్యూలు అక్టోబర్ 5&6 తేదీలలో ఉండబోతున్నాయి
ఇంటర్వ్యూ కి హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేకం
తెలంగాణ అడవులు -జాతీయ అటవీ
విధానాలు.1952,1988,
నూతన అటవీ విధానం ముసాయిదా2018
- ఒక ప్రాంతంలో సహజసిద్ధంగా పెరిగిన అనేక రకాల వృక్షాలతో కూడుకున్న ప్రదేశాన్ని అడవి అంటారు.
- అడవులను ఆంగ్లంలో ఫారెస్ట్ అంటారు.
- ఫారెస్ట్ అనేది లాటిన్ భాషా పదమైన ఫోరస్ అనే పదం నుంచి ఉద్భవించింది. -
- ఫోరస్ అంటే గ్రామం వెలుపలి ప్రాంతం అని అర్థం. -
- అడవుల గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని ఫారెస్ట్రీ అంటారు. -
- దేశంలో 1927లో బ్రిటిష్ ప్రభుత్వం అటవీ చట్టాన్ని చేసింది. -
- 1952లో నూతన అటవీ విధానాన్ని భారత ప్రభుత్వం రూపొందించింది. (ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్) -
- ఈ అటవీ విధానం ప్రకారం దేశ భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం అడవులు ఉండాలి. -
- తెలంగాణ రాష్ట్ర అటవీ నివేదిక - 2015-16 ప్రకారం
- తెలంగాణ అటవీ విస్తీర్ణం - 27,292 చ.కి.మీ. - తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణ శాతం - 24.35 -
- భారత్లో అడవుల విస్తీర్ణం పరంగా తెలంగాణ స్థానం - 12 ()
- భారతదేశ అటవీ విస్తీర్ణం - 7,01,673 చ.కి.మీ. -
- భారతదేశ విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణ శాతం - 21.34 అటవీ విధాన లక్ష్యం
- తెలంగాణలో జీవ వైవిధ్యత -
- 2800 రకాల మొక్కలు -
- 21 రకాల ఉభయచరాలు -
- 108 రకాల క్షీరదజాతులు -
- 365 రకాల పక్షిజాతులు -
- 28 రకాల సరీసృపాలు ఉన్నాయి -
- జీవవైవిధ్య రక్షిత ప్రాంతాలు 12.
- దీనిలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు (అభయారణ్యాలు)-9,
- జాతీయ పార్కులు- 3 ఉన్నాయి
- తెలంగాణలో చిరుతపులి, అడవిదున్న, పులులు, నాలుగు కొమ్ముల దుప్పి, కృష్ణజింక, బురద మొసలి, డేగలు మొదలైన జంతువులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.
- వీటిని కాపాడటానికి ఆవాసాంతర రక్షణ, ఆవాసేతర రక్షణలను ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉంది. -
- ఆవాసాంతర రక్షణ- జాతీయపార్కులు, అభయారణ్యాలు, బయోస్పియర్ రిజర్వులు. ఆవాసేతర రక్షణ- జీన్ బ్యాంకుల ఏర్పాటు ఉంటుంది.
తెలంగాణలోని జాతీయ పార్కులు
1. కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు, జూబ్లీహిల్స్, హైదరాబాద్ - స్థాపన - 1998 - విస్తీర్ణం - 1.42 చ.కి.మీ. - ఇది పక్షులకు ప్రసిద్ధి - పక్షి జాతుల సంఖ్య - 140 - మొక్క జాతుల సంఖ్య - 600
2.మహావీర్ హరిణ వనస్థలి జాతీయ పార్కు, వనస్థలిపురం, రంగారెడ్డి
- స్థాపన - 1975 - విస్తీర్ణం - 14.59 చ.కి.మీ. - సంరక్షిస్తున్న ముఖ్య జంతువు - జింక
3.మృగవని జాతీయ పార్కు, చిలుకూరు, మొయినాబాద్, రంగారెడ్డి
- స్థాపన - 1994 - విస్తీర్ణం - 3.6 చ.కి.మీ. - ఇక్కడ సంరక్షిస్తున్న జంతువు - కుందేలు, అడవిపిల్లి, రక్తపింజర, పైథాన్ (కొండ చిలువ), అడవి పంది - ఈ జాతీయ పార్కు పూర్వపు పేరు - చిలుకూరు రిజర్వు ఫారెస్ట్ - దీన్ని 1994లో వైల్డ్లైఫ్ అభయారణ్యంగా భారత ప్రభుత్వం ప్రకటించింది.
(దేశంలోని మొత్తం జాతీయ పార్కుల సంఖ్య- 104, అభయారణ్యాల సంఖ్య- 536 (2016, ఏప్రిల్ వరకు))
తెలంగాణలోని అభయారణ్యాలు -9
1. కవ్వాల్ అభయారణ్యం - వైశాల్యం - 892 చ.కి.మీ. - ఇది ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో విస్తరించి ఉంది. - దీనిలో 4 పులులు ఉన్నాయి. నీల్గాయ్, అరిచే జింకలు, అడవి దున్న ఉన్నాయి.
2. ప్రాణహిత అభయారణ్యం
- మంచిర్యాల జిల్లా (ప్రాణహిత నది పరీవాహక ప్రాంతం) - వైశాల్యం - 136 చ.కి.మీ. - అంతరించిపోయే దశలో ఉంది. - కృష్ణజింక, చింకార, తాబేళ్లు ఉన్నాయి.
3. శివారం అభయారణ్యం
- పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో విస్తరించి ఉంది - వైశాల్యం - 29.81 చ.కి.మీ. - మొసళ్లు, కష్ణజింక, ఎలుగుబంట్లు ఉన్నాయి
4. ఏటూరు నాగారం అభయారణ్యం
- ఏటూరు నాగారం, జయశంకర్ భూపాలపల్లిలో విస్తరించి ఉంది. - వైశాల్యం - 806.15 చ.కి.మీ. - దీనిలో తోడేళ్లు, నీల్గాయ్, సాంబార్, కృష్ణజింక, మచ్చల జింక ఉన్నాయి. గమనిక: ఇది తెలంగాణలో పురాతన అభయారణ్యం
- దీని గుండా గోదావరి నది ప్రవహిస్తుంది
- ఈ అభయారణ్యంలో రాక్షస గూళ్లు, చారిత్రక యుగానికి చెందిన శిలాధారాలు లభించాయి.
5. పాకాల అభయారణ్యం
- పాకాల, వరంగల్ గ్రామీణ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది. - వైశాల్యం - 860 చ.కి.మీ - దీనిలో జంతు జాతులు- సాంబార్, నీల్గాయ్, స్లోత్ బేర్, నాలుగు కొమ్ముల దుప్పి, కృష్ణజింక, అడవి పందులు - దీనిలోని పక్షి జాతులు - కొంగలు, గుడ్లగూబలు, అడవి బాతులు
6. కిన్నెరసాని అభయారణ్యం
- పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం - వైశాల్యం - 635.40 చ.కి.మీ. - దీనిలోని జంతువులు - చింకార, హైనా, సాంబార్, అడవి పంది, అడవి దున్న, పులి, కృష్ణజింక
7. అమ్రాబాద్ అభయారణ్యం (రాజీవ్ గాంధీ వైల్డ్లైఫ్ అభయారణ్యం)
- నాగర్కర్నూలు, నల్లగొండ జిల్లాల్లో విస్తరించి ఉంది. - విస్తీర్ణం - 2166.37 చ.కి.మీ. - సంరక్షించే జంతువులు - బెంగాల్ పులి, చిరుత, సాంబార్, కృష్ణజింక గమనిక: ఈ అభయారణ్యాన్ని 1978లో వన్యమృగ సంరక్షణ కేంద్రంగా గుర్తించారు. 1983లో పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తించారు. - ఇది దేశంలోనే అతిపెద్ద అభయారణ్యం - రాష్ట్ర విభజనవల్ల ఈ అభయారణ్యాన్ని విభజించారు. తెలంగాణ ప్రభుత్వం అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తిస్తూ 2015, ఫిబ్రవరి 6న ఉత్తర్వులు జారీ చేసింది. - దీనిలోని పులుల సంఖ్య - 9 - ఇండియాలో అత్యధిక పులులు ఉన్న రాష్ట్రం- కర్ణాటక (406) - ఇండియాలో మొత్తం పులుల సంఖ్య- 2226
8. మంజీర అభయారణ్యం
- మెదక్ జిల్లాలో ఉంది - విస్తీర్ణం - 20 చ.కి.మీ. - ఈ అభయారణ్యంలో 70 రకాల వివిధ పక్షిజాతులు, క్షీరదాలు, వృక్షజాతులు, సరీసృపాలు ఉన్నాయి. - ఇది ప్రధానంగా మగ్గర్ మొసళ్లకు ప్రసిద్ధి.
9. పోచారం అభయారణ్యం
- ఇది కామారెడ్డి- మెదక్ జిల్లాల్లో విస్తరించి ఉంది. - విస్తీర్ణం- 130 చ.కి.మీ. - ఈ అభయారణ్యం నెమళ్లు, పాములు, కొంగలు, బాతులు, చిరుత పులులకు ప్రసిద్ధి
( ఔషధ అభయారణ్యం - అనంతగిరి)
దేశంలో మొదటి జాతీయ పార్కు - హేలి (ఉత్తరాఖండ్, 1935) - ప్రస్తుతం దీన్ని జిమ్కార్బెట్ జాతీయపార్కు అని పిలుస్తున్నారు. - ఇది ఒక వేటగాడి పేరున ఏర్పడిన జాతీయ పార్కు
జీవావరణ కేంద్రాలు
- వీటి సరిహద్దులను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. జంతువులతోపాటు అన్నిరకాల జీవజాతులను రక్షిస్తారు. ఇందులో టూరిజాన్ని అనుమతివ్వరు. - ఇండియాలో మొదట గుర్తించిన జీవావరణ కేంద్రం - నీలగిరి (తమిళనాడు, 1986) - ఇండియాలో ఇటీవల గుర్తించిన జీవావరణ కేంద్రం- పన్నా (మధ్యప్రదేశ్, 2011) - ప్రస్తుతం ఇండియాలోని జీవావరణ కేంద్రాల సంఖ్య- 18 - వీటిలో 10 జీవావరణ కేంద్రాలు యునెస్కో జాబితాలో చేర్చారు. - ఇండియాలోని అతిపెద్ద జీవావరణ కేంద్రం- రాణా ఆఫ్ కచ్ (గుజరాత్, 12,454 చ.కి.మీ.) - ఇండియాలోని అతిచిన్న జీవావరణ కేంద్రం- దిబ్రు సైకోవా (అసోం, 765 చ.కి.మీ.) - యునెస్కో వారు గుర్తించిన జీవావరణ కేంద్రాలు
1. నీలగిరి (తమిళనాడు)
2. మన్నార్ సింధుశాఖ (తమిళనాడు) 3. సుందర్బన్ (పశ్చిమబెంగాల్) 4. నందాదేవి (ఉత్తరాఖండ్) 5. అగస్త్యమలై (కేరళ, తమిళనాడు) - అగస్త్యమలై జీవావరణ కేంద్రాన్ని ఇటీవల 2016లో యునెస్కో జాబితాలో చేర్చారు.
తెలంగాణలోని జూలాజికల్ పార్కులు
1. నెహ్రూ జూలాజికల్ పార్క్ - షామీర్పేట, హైదరాబాద్, 1963, అక్టోబర్ 3 - ఇది సహజ పరిస్థితులను కల్పింపజేసి ఏర్పాటుచేసిన జూపార్కుల్లో దేశంలోనే మొదటిది.
2. వన విజ్ఞాన కేంద్రం
- వరంగల్, 1985
3.2001లో కరీంనగర్లో ఉజ్వల పార్కును ఏర్పాటు చేశారు.
తెలంగాణలోని ప్రధాన జింకల పార్కులు (ప్రభుత్వ ఆధ్వర్యంలోనివి)
1. కిన్నెరసాని జింకల పార్కు- పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం
2. లోయర్ మానేరు డ్యాం జింకల పార్కు- కరీంనగర్
3. జవహర్లాల్ నెహ్రూ జింకల పార్కు- షామీర్పేట,హైదరాబాద్
అటవీ విధానాలు తరువాయి పేజీలో