Friday, November 16, 2018

ఓటును తల్లిగా భావించే గ్రామం ఓటాయి

ఓటాయి=ఓటు+ఆయి. (ఆయి=అమ్మ )(ఓటమ్మా).
ఓటును తల్లిగా భావించే గ్రామం ఓటాయి.

తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఒక గ్రామం ఓటును తల్లిగా కొలుస్తుంది ."ఓటాయి" గా పేరు కలిగిన ఈ గ్రామంలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా- 2543 మంది, మొత్తం జనావాసాలు- 688
గ్రామంలో పురుషుల జనాభా కన్న స్త్రీ జనాభా ఎక్కువ.51.1%.(1300మంది)
అక్షరాస్యత 51%(1298 మంది అక్షరాస్యులు)(తెలంగాణ సగటు అక్షరాస్యత కన్నా తక్కువ),
స్త్రీ ల అక్షరాస్యత 22.2%(565మంది)
మొత్తం జనాభాలో గిరిజన జనాభా 49.1%(1249 మంది) షెడ్యూలు కులాల జనాభా 12.7%(323)
ఓటాయి మొత్తం విస్తీర్ణం 270.08 హెక్టార్లు
వ్యవసాయేతర భూమి 26.52 హెక్టార్లు
వ్యవసాయ భూమి 245 హెక్టార్లు.
రాజ్యాంగంలోని 5 వ షెడ్యూల్ లో  పొందుపరచడ్డ ఈ గ్రామం ఇది
చారిత్రకంగా, భౌగోళికంగా ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ గ్రామం,కాకతీయుల కాలం నుండి తన ప్రత్యేకతను చాటుకుంటుంది.పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గిరిజన  గ్రామంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత   నుండి ఒక వైవిధ్య భరితమైన రాజకీయ సంసృతి ఫరిీడవిల్లుతుంది.కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష, ఆర్థిక భేదభావం లేకుండా దేశంలో నివసించే మేజర్‌ అయన ప్రతి యువతి, యువకుడు ఓటు హక్కు పొందే అవకాశం భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 326 కల్పిస్తున్నది ,దీన్ని గుర్తించి ఈ గ్రామ వాసులు 'ఓటు' అనే రెండక్షరాలకు ప్రపంచ గతిని మార్చే శక్తి ఉందని, ఓటు వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తిస్తుందని,వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుందని నమ్మి .ఓటు ఆవశ్యకత, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటుకున్న పాత్ర గురించి,ఓటు విలువ తెలిసిన ఈ గ్రామ పెద్దలు మొదటి సార్వత్రిక ఎన్నికల నుండి వారి గ్రామాన్ని ఓటాయి (ఓటు+ఆయి)గా పిలుస్తున్నారు. (ఆయి అంటే అమ్మ అని మనందరికీ తెలిసిందే) .2543 మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో 850 పైచిలుకు ఓటర్లు ఉన్నారు
‘భారత ప్రజాస్వామ్య పరిరక్షణకోసం నా వంతు కర్తవ్యాన్ని గుర్తించి ఉన్నతమైన నాయకున్ని ఎన్నుకుంటానని’ ప్రతిజ్ఞ చేస్తూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం పోలింగ్ జరిగేలా ఆ గ్రామస్తులు కృషి చేస్తున్నారు

Wednesday, October 3, 2018

జూనియర్ పంచాయతీ కార్యదర్శి హాల్ టికెట్ డౌన్లోడ్

http://htno1.tsprrecruitment.in:8081/HallTicket.aspx

Click on above link


  Enter
              1.Your Mobile Number
              2.Date of Birth.


Telangana FRO Recruitment Interview Guidance&all exams

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ నియామకాల ఇంటర్వ్యూలు అక్టోబర్ 5&6 తేదీలలో ఉండబోతున్నాయి

ఇంటర్వ్యూ కి  హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేకం



తెలంగాణ అడవులు -జాతీయ అటవీ
విధానాలు.1952,1988,
నూతన అటవీ విధానం ముసాయిదా2018

  • ఒక ప్రాంతంలో సహజసిద్ధంగా పెరిగిన అనేక రకాల వృక్షాలతో కూడుకున్న ప్రదేశాన్ని అడవి అంటారు.
  • అడవులను ఆంగ్లంలో ఫారెస్ట్ అంటారు.
  • ఫారెస్ట్ అనేది లాటిన్ భాషా పదమైన ఫోరస్ అనే పదం నుంచి ఉద్భవించింది. -
  • ఫోరస్ అంటే గ్రామం వెలుపలి ప్రాంతం అని అర్థం. -
  • అడవుల గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని ఫారెస్ట్రీ అంటారు. -
  • దేశంలో 1927లో బ్రిటిష్ ప్రభుత్వం అటవీ చట్టాన్ని చేసింది. -
  • 1952లో నూతన అటవీ విధానాన్ని భారత ప్రభుత్వం రూపొందించింది. (ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్) -
  • ఈ అటవీ విధానం ప్రకారం దేశ భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం అడవులు ఉండాలి. -



  • తెలంగాణ రాష్ట్ర అటవీ నివేదిక - 2015-16 ప్రకారం
  • తెలంగాణ అటవీ విస్తీర్ణం - 27,292 చ.కి.మీ. - తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణ శాతం - 24.35 -
  • భారత్‌లో అడవుల విస్తీర్ణం పరంగా తెలంగాణ స్థానం - 12 ()
  • భారతదేశ అటవీ విస్తీర్ణం - 7,01,673 చ.కి.మీ. -
  • భారతదేశ విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణ శాతం - 21.34 అటవీ విధాన లక్ష్యం

  • తెలంగాణలో జీవ వైవిధ్యత -
  • 2800 రకాల మొక్కలు -
  • 21 రకాల ఉభయచరాలు -
  • 108 రకాల క్షీరదజాతులు -
  • 365 రకాల పక్షిజాతులు -
  • 28 రకాల సరీసృపాలు ఉన్నాయి -
  • జీవవైవిధ్య రక్షిత ప్రాంతాలు 12.
  • దీనిలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు (అభయారణ్యాలు)-9,
  • జాతీయ పార్కులు- 3 ఉన్నాయి
  • తెలంగాణలో చిరుతపులి, అడవిదున్న, పులులు, నాలుగు కొమ్ముల దుప్పి, కృష్ణజింక, బురద మొసలి, డేగలు మొదలైన జంతువులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.
  • వీటిని కాపాడటానికి ఆవాసాంతర రక్షణ, ఆవాసేతర రక్షణలను ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉంది. -
  • ఆవాసాంతర రక్షణ- జాతీయపార్కులు, అభయారణ్యాలు, బయోస్పియర్ రిజర్వులు. ఆవాసేతర రక్షణ- జీన్ బ్యాంకుల ఏర్పాటు ఉంటుంది.

తెలంగాణలోని జాతీయ పార్కులు

1. కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు, జూబ్లీహిల్స్, హైదరాబాద్ - స్థాపన - 1998 - విస్తీర్ణం - 1.42 చ.కి.మీ. - ఇది పక్షులకు ప్రసిద్ధి - పక్షి జాతుల సంఖ్య - 140 - మొక్క జాతుల సంఖ్య - 600


2.మహావీర్ హరిణ వనస్థలి జాతీయ పార్కు, వనస్థలిపురం, రంగారెడ్డి

- స్థాపన - 1975 - విస్తీర్ణం - 14.59 చ.కి.మీ. - సంరక్షిస్తున్న ముఖ్య జంతువు - జింక

3.మృగవని జాతీయ పార్కు, చిలుకూరు, మొయినాబాద్, రంగారెడ్డి

- స్థాపన - 1994 - విస్తీర్ణం - 3.6 చ.కి.మీ. - ఇక్కడ సంరక్షిస్తున్న జంతువు - కుందేలు, అడవిపిల్లి, రక్తపింజర, పైథాన్ (కొండ చిలువ), అడవి పంది - ఈ జాతీయ పార్కు పూర్వపు పేరు - చిలుకూరు రిజర్వు ఫారెస్ట్ - దీన్ని 1994లో వైల్డ్‌లైఫ్ అభయారణ్యంగా భారత ప్రభుత్వం ప్రకటించింది.

(దేశంలోని మొత్తం జాతీయ పార్కుల సంఖ్య- 104, అభయారణ్యాల సంఖ్య- 536 (2016, ఏప్రిల్ వరకు))

తెలంగాణలోని అభయారణ్యాలు -9

1. కవ్వాల్ అభయారణ్యం - వైశాల్యం - 892 చ.కి.మీ. - ఇది ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో విస్తరించి ఉంది. - దీనిలో 4 పులులు ఉన్నాయి. నీల్‌గాయ్, అరిచే జింకలు, అడవి దున్న ఉన్నాయి.

2. ప్రాణహిత అభయారణ్యం

- మంచిర్యాల జిల్లా (ప్రాణహిత నది పరీవాహక ప్రాంతం) - వైశాల్యం - 136 చ.కి.మీ. - అంతరించిపోయే దశలో ఉంది. - కృష్ణజింక, చింకార, తాబేళ్లు ఉన్నాయి.

3. శివారం అభయారణ్యం

- పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో విస్తరించి ఉంది - వైశాల్యం - 29.81 చ.కి.మీ. - మొసళ్లు, కష్ణజింక, ఎలుగుబంట్లు ఉన్నాయి

4. ఏటూరు నాగారం అభయారణ్యం

- ఏటూరు నాగారం, జయశంకర్ భూపాలపల్లిలో విస్తరించి ఉంది. - వైశాల్యం - 806.15 చ.కి.మీ. - దీనిలో తోడేళ్లు, నీల్‌గాయ్, సాంబార్, కృష్ణజింక, మచ్చల జింక ఉన్నాయి. గమనిక: ఇది తెలంగాణలో పురాతన అభయారణ్యం

- దీని గుండా గోదావరి నది ప్రవహిస్తుంది

- ఈ అభయారణ్యంలో రాక్షస గూళ్లు, చారిత్రక యుగానికి చెందిన శిలాధారాలు లభించాయి.

5. పాకాల అభయారణ్యం

- పాకాల, వరంగల్ గ్రామీణ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది. - వైశాల్యం - 860 చ.కి.మీ - దీనిలో జంతు జాతులు- సాంబార్, నీల్‌గాయ్, స్లోత్ బేర్, నాలుగు కొమ్ముల దుప్పి, కృష్ణజింక, అడవి పందులు - దీనిలోని పక్షి జాతులు - కొంగలు, గుడ్లగూబలు, అడవి బాతులు

6. కిన్నెరసాని అభయారణ్యం

- పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం - వైశాల్యం - 635.40 చ.కి.మీ. - దీనిలోని జంతువులు - చింకార, హైనా, సాంబార్, అడవి పంది, అడవి దున్న, పులి, కృష్ణజింక

7. అమ్రాబాద్ అభయారణ్యం (రాజీవ్ గాంధీ వైల్డ్‌లైఫ్ అభయారణ్యం)

- నాగర్‌కర్నూలు, నల్లగొండ జిల్లాల్లో విస్తరించి ఉంది. - విస్తీర్ణం - 2166.37 చ.కి.మీ. - సంరక్షించే జంతువులు - బెంగాల్ పులి, చిరుత, సాంబార్, కృష్ణజింక గమనిక: ఈ అభయారణ్యాన్ని 1978లో వన్యమృగ సంరక్షణ కేంద్రంగా గుర్తించారు. 1983లో పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తించారు. - ఇది దేశంలోనే అతిపెద్ద అభయారణ్యం - రాష్ట్ర విభజనవల్ల ఈ అభయారణ్యాన్ని విభజించారు. తెలంగాణ ప్రభుత్వం అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తిస్తూ 2015, ఫిబ్రవరి 6న ఉత్తర్వులు జారీ చేసింది. - దీనిలోని పులుల సంఖ్య - 9 - ఇండియాలో అత్యధిక పులులు ఉన్న రాష్ట్రం- కర్ణాటక (406) - ఇండియాలో మొత్తం పులుల సంఖ్య- 2226

8. మంజీర అభయారణ్యం

- మెదక్ జిల్లాలో ఉంది - విస్తీర్ణం - 20 చ.కి.మీ. - ఈ అభయారణ్యంలో 70 రకాల వివిధ పక్షిజాతులు, క్షీరదాలు, వృక్షజాతులు, సరీసృపాలు ఉన్నాయి. - ఇది ప్రధానంగా మగ్గర్ మొసళ్లకు ప్రసిద్ధి.

9. పోచారం అభయారణ్యం

- ఇది కామారెడ్డి- మెదక్ జిల్లాల్లో విస్తరించి ఉంది. - విస్తీర్ణం- 130 చ.కి.మీ. - ఈ అభయారణ్యం నెమళ్లు, పాములు, కొంగలు, బాతులు, చిరుత పులులకు ప్రసిద్ధి

( ఔషధ అభయారణ్యం - అనంతగిరి)

 దేశంలో మొదటి జాతీయ పార్కు - హేలి (ఉత్తరాఖండ్, 1935) - ప్రస్తుతం దీన్ని జిమ్‌కార్బెట్ జాతీయపార్కు అని పిలుస్తున్నారు. - ఇది ఒక వేటగాడి పేరున ఏర్పడిన జాతీయ పార్కు

జీవావరణ కేంద్రాలు

- వీటి సరిహద్దులను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. జంతువులతోపాటు అన్నిరకాల జీవజాతులను రక్షిస్తారు. ఇందులో టూరిజాన్ని అనుమతివ్వరు. - ఇండియాలో మొదట గుర్తించిన జీవావరణ కేంద్రం - నీలగిరి (తమిళనాడు, 1986) - ఇండియాలో ఇటీవల గుర్తించిన జీవావరణ కేంద్రం- పన్నా (మధ్యప్రదేశ్, 2011) - ప్రస్తుతం ఇండియాలోని జీవావరణ కేంద్రాల సంఖ్య- 18 - వీటిలో 10 జీవావరణ కేంద్రాలు యునెస్కో జాబితాలో చేర్చారు. - ఇండియాలోని అతిపెద్ద జీవావరణ కేంద్రం- రాణా ఆఫ్ కచ్ (గుజరాత్, 12,454 చ.కి.మీ.) - ఇండియాలోని అతిచిన్న జీవావరణ కేంద్రం- దిబ్రు సైకోవా (అసోం, 765 చ.కి.మీ.) - యునెస్కో వారు గుర్తించిన జీవావరణ కేంద్రాలు

1. నీలగిరి (తమిళనాడు)

2. మన్నార్ సింధుశాఖ (తమిళనాడు) 3. సుందర్‌బన్ (పశ్చిమబెంగాల్) 4. నందాదేవి (ఉత్తరాఖండ్) 5. అగస్త్యమలై (కేరళ, తమిళనాడు) - అగస్త్యమలై జీవావరణ కేంద్రాన్ని ఇటీవల 2016లో యునెస్కో జాబితాలో చేర్చారు.

తెలంగాణలోని జూలాజికల్ పార్కులు

1. నెహ్రూ జూలాజికల్ పార్క్ - షామీర్‌పేట, హైదరాబాద్, 1963, అక్టోబర్ 3 - ఇది సహజ పరిస్థితులను కల్పింపజేసి ఏర్పాటుచేసిన జూపార్కుల్లో దేశంలోనే మొదటిది.

2. వన విజ్ఞాన కేంద్రం

- వరంగల్, 1985

3.2001లో కరీంనగర్‌లో ఉజ్వల పార్కును ఏర్పాటు చేశారు.

తెలంగాణలోని ప్రధాన జింకల పార్కులు (ప్రభుత్వ ఆధ్వర్యంలోనివి)

1. కిన్నెరసాని జింకల పార్కు- పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం
2. లోయర్ మానేరు డ్యాం జింకల పార్కు- కరీంనగర్
3. జవహర్‌లాల్ నెహ్రూ జింకల పార్కు- షామీర్‌పేట,హైదరాబాద్

అటవీ విధానాలు తరువాయి పేజీలో


Monday, October 1, 2018

జూనియర్ పంచాయతీ కార్యదర్శి

తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం 2018
http://www.shineindiaeducation.com/telangana-panchayat-raj-act-2018-section-3-141-in-telugu-pdf/

తెలంగాణ ఉద్యమంలో ఓటాయి గ్రామ పాత్ర



 గ్రౌండ్ రిపోర్ట్ అక్టోబర్2:

తెలంగాణ ఉద్యమంలో ఓటాయి గ్రామ పాత్ర
1.తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన నినాదం "నీళ్లు నిధులు నియామకాలు" ఓటాయి గ్రామం నుండే  వచ్చింది ప్రొఫెసర్ Dr బియ్యాల జనార్దన్ రావు సర్ ఇచ్చినదే.

2.1969 తెలంగాణ ఉద్యమం విఫలమైన తర్వాత అప్పుడున్న కోపోద్రిక్త యువతరం నక్సల్బరీ పంథాలో తెలంగాణ సాధన కోసం ఉపక్రమించింది. ఆ పిలుపుకి ప్రతిస్పందనగా ఓటాయి యువత భూమి కోసం, భుక్తి కోసం, తాడిత పీడిత విముక్తి కోసం ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలో పాల్గొన్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుల్లో ఓటాయి గ్రామవాసులు ఉన్నారు.

 భౌగోళికంగా ఓటాయి గ్రామం ఎంతో విశిష్టమైనది ఓటాయి గ్రామo లో పడ్డ వర్షపు నీరు కృష్ణా, గోదావరి  రెండు నదుల్లో కలుస్తుంది.కొంత నీరు లక్నవరం సరస్సు లో (గోదావరి బేసిన్) కొంత నీరు పాకాల సరస్సులో (కృష్ణా బేసిన్) కలుస్తుంది.

చారిత్రకంగా ఓటాయి గ్రామంలో చరిత్ర పూర్వ యుగం నుండి జనావాసాలు ఉన్నట్లు మన మర్రి చెట్టు కింద ఉన్న రాక్షసగూడే (రంగుల రాట్నం ని పోలిన నిర్మాణం)నిదర్శనం (Megalithic Structure). ఇలాంటి నిర్మాణాలు తాడ్వాయి అడవుల్లో కూడా ఉన్నాయి.
కాకతీయుల కాలం నాటి ఆనవాళ్లు అనేకం మన ఊళ్ళో ఉన్నాయి. కాకతీయుల కాలంలో యుద్ధంలో గెలిచిన వీరులను విగ్రహాల రూపంలో కొలిచే విరగళ్ సాంప్రదాయం ఉండేది.మన గ్రామంలోని "పోటోని గడ్డ" లో కోటి చెరువు కి పోయే దారిలో ఉన్న "వీర్లు" ఈ వీరగళ్

2011 జనాభా లెక్కల ప్రకారం
 మొత్తం జనాభా- 2543 మంది,
మొత్తం జనావాసాలు- 688
 గ్రామంలో పురుషుల జనాభా కన్న స్త్రీ జనాభా ఎక్కువ.51.1%.(1300మంది)
అక్షరాస్యత 51%(1298 మంది అక్షరాస్యులు)(తెలంగాణ సగటు అక్షరాస్యత కన్నా తక్కువ),
స్త్రీ ల అక్షరాస్యత 22.2%(565మంది)
మొత్తం జనాభాలో గిరిజన జనాభా 49.1%(1249 మంది)
షెడ్యూలు కులాల జనాభా 12.7%(323)

ఓటాయి మొత్తం విస్తీర్ణం 270.08 హెక్టార్లు
వ్యవసాయేతర భూమి 26.52 హెక్టార్లు
వ్యవసాయ భూమి 245 హెక్టార్లు.

రాజ్యాంగంలోని 5 వ షెడ్యూల్ లో  పొందుపరచడ్డ గ్రామం ఓటాయి

గ్రౌండ్ రిపోర్ట్ అక్టోబర్ 2 :కొత్తగూడ మండలంలో గత నెల రోజులుగా వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం తద్వారా గాలి లోని తేమ శాతం పెరిగి తీవ్రమైన ఉక్కపోతతో చెమటలు పట్టి, గాలి వీయకపోవడం వలన చెమటతో శరీరం జిగటగా మారి తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాము. మండలం అంతా కొండలు, గుట్టలతో ఉన్న భూభాగం ఎక్కువగా ఉండడం,ఈ భూభాగానికి తొందరగా వేడెక్కే లక్షణం ఉండడంతో, భూమి బాగా వేడెక్కినప్పుడు దాన్ని అనుకుని ఉన్న గాలి కూడా వేడెక్కి తేలికై పైకి పోయిి, ఈ గాలి పైకి చేరగానే వ్యాకోచించి చల్లబడి, చల్లదనం వల్ల మేఘాలు ఏర్పడడం (వీటినే కుమ్యులోనింబస్ మేఘాలు అంటారు), మరియు ఈ గాలి తేమను ఇమడ్చుకునే సామర్త్యాన్ని కోల్పోవడం జరుగుతుంది., దీని కారణంగా మేఘాల్లోని నీటి ఆవిరి ద్రవీభవించి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం సంభవిస్తుంది. ఈ విధంగా కురిసే వర్షపాతాన్నీ  సంవహన వర్షపాతం అంటారు. గత , వారం రోజులుగా కొత్తగూడ  మండలంలో మధ్యాహ్నం వరకు ఉష్ణోగ్రతలు పెరగడం. దాంతో వేడెక్కిన గాలి ఊర్ధ్వంగా పైకి వెళ్ళి కుమ్యులోనింబస్ మేఘాలు ఏర్పడడం, ఈ మేఘాలనుండే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడం, ఈ వర్షం కురిసిన కొద్ధి సేపటికే ఆకాశం నిర్మలంగా మారడం,ఎవరో ఒకరు పిడుగుపాటుకు గురై చనిపోయారని చేదు వార్త వినడం జరుగుతుంది.